Current Date: 06 Oct, 2024

5,6 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సమావేశం


ఈనెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో కలక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లండించారు.ఈమేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. సిసోడియా మాట్లాడుతూ  
మొదటి రోజు కలక్టర్లతోను,రెండవ రోజు కలక్టర్లు,ఎస్పిలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.5వతేదీ ఉదయం 10గం.ల నుండి 11 గం.ల వరకూ కలక్టర్ల సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.రెండు రోజుల్లోను ఉదయం 10గం.ల నుండి సా.6గం.ల వరకూ కలక్టర్ల సమావేశం ఉంటుందని స్పెషల్ సిఎస్ సిసోడియా పేర్కొన్నారు.
కలక్టర్ల సమావేశానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్యులు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆహ్వానాలు పంపే ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ చేయాలని  సిసోడియా ఆదేశించారు

Share