Current Date: 06 Oct, 2024

టీటీడీ ఈవోగా శ్యామలరావు

టీటీడీ  ఈవోగా జె. శ్యామల రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1997వ బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం సెలవుపై పంపించిన సంగతి తెల్సిందే. శ్యామలరావు గతంలో విశాఖ కలెక్టర్ సహా పలు కీలక పోస్టుల్లో పనిచేశారు. ఆయన్ను  రెవెన్యూ శాఖ నుంచి దేవదాయ శాఖకు తీసుకువచ్చి టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించారు.

Share