Current Date: 06 Oct, 2024

సెజ్‌ ప్రమాద బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ

 అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు.

Share