Current Date: 05 Oct, 2024

నీరజ్ చోప్రాకు ఫోన్ చేసి మోదీ అభినందన

పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వయంగా ఫోన్ చేసి వరుసగా రెండో ఒలింపిక్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ప్రశంసించారు. గోల్డ్ కోసం శ్రమించినా ఫలితం దక్కలేదని చోప్రా ఆవేదన వ్యక్తం చేయగా అద్భుతంగా ఆడావ్ అంటూ మోదీ చెప్పారు. గాయం గురించి అడిగి తెలుసుకొని, అతని తల్లి చూపిన క్రీడాస్ఫూర్తిని మెచ్చుకున్నారు.

Share