Current Date: 21 Sep, 2024

తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన రమణదీక్షితులు

శ్రీవారి లడ్డూలో కొవ్వు నిజమేనని, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారణ కావడం ప్రకంపనలు రేపుతోంది. భక్తులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రగడ రాజేస్తున్న ఈ వ్యవహారంపై శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యార పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు తిరుమలలో మహాపాపం జరిగిందని, నెయ్యిలో కొవ్వు పదార్ధాలు కలవడం వల్ల అపచారం జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోందని రమణ దీక్షితులు అన్నారు.

Share