Current Date: 04 Jul, 2024

టీ20 వరల్డ్‌కప్‌లో దాయాది పాక్‌ను మట్టికరిపించిన భారత్

అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ అద్భుత ప్రదర్శనతో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను మట్టికరిపించింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్‌ను 113 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా అందర్నీ ఆశ్చర్యపరిచింది.120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. దాంతో 10 ఓవర్లు ముగిసే సరికి పాక్‌.. 57/1తో నిలిచింది. చేయాల్సిన స్కోరు తక్కువే ఉండటం 9 వికెట్లు చేతిలో ఉండటంతో ఆ జట్టు విజయంపై ధీమాగా ఉంది. కానీ క్రమశిక్షణతో  బంతులేసిన భారత పేసర్లు పాక్‌పై ఒత్తిడి పెంచారు. 

Share