Current Date: 05 Oct, 2024

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు చిన్నభిన్నాం అవటంతోపాటు వారి జీవి తాలను చిదిమేస్తున్నాయి. తాజాగా విశాఖలో భర్త స్నేహితుడు తోనే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ భార్య నయవంచన ను తట్టుకోలేని ఆమె భర్త ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..విశాఖలో నివాసం వుంటున్న హరిప్రసాద్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి , భువనేశ్వరి అనే మరో వివాహితను గత కొన్నేళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నాడు. కొంత కాలంపాటు సజావుగా సాగిన వీరి బంధం, హరిప్రసాద్ స్నేహితుడు పెంకి రాజేష్ అనే వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో వారి కాపురంలో కలతలు చెలరేగాయి. భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన హరిప్రసాద్ తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. అంతకుముందు తన భార్య, స్నేహితుడు చేసిన మోసాన్ని సెల్ఫీ వీడియో ద్వారా రికార్డు చేసి తన చావుకు వారే కారణమంటూ వాంగ్మూలం ఇచ్చి తన మొదటి భార్యకు ఆ వీడియో ను షేర్ చేసాడు. తన మొదటి భార్యకు తనకు పుట్టిన బిడ్డను కాపాడాలని, తనకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని హరిప్రసాద్ వీడియో ద్వారా పోలీసులను కోరారు. ఈ ఘటనపై తన మాజీ భర్త హరిప్రసాద్ ఆత్మహత్య కు అతని భార్య భువనేశ్వరి, స్నేహితుడు రాజేషే కారణమని హరిప్రసాద్ మొదటి భార్య వరలక్ష్మి విశాఖ నగరం లోని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అతనికి జరిగిన అన్యాయానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరింది.

Share