Current Date: 06 Oct, 2024

రోడ్డు పనుల్ని పరిశీలించిన కార్పొరేటర్‌ ముమ్మన

జీవీఎంసీ 95వ వార్డు కృష్ణరాయపురం నుంచి జ్యోతినగర్‌ వరకు రూ.68.95 లక్షల జీవీఎంసీ నిధులుతో జరుగుతున్న తారు రోడ్డు పనుల్ని 95వ వార్డు కార్పొరేటర్‌ ముమ్మన దేముడు సోమవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి, పనులు క్రమ పద్ధతిలో చేయాలని, వేగిరంగా అందుబాట్లోకి తీసుకు రావాలని కాంట్రాక్టర్‌కు సూచించారు, కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంగటి సూరిబాబు, ఉమా మహేష్‌, బొడ్డు దేముడు బాబు, దలాయి శ్రీను, చాణక్య, జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Share