Current Date: 05 Oct, 2024

వైసీపీ వాళ్లకి చంద్రబాబు పీఏ వీఐపీ దర్శనాలు!

టీడీపీ, వైసీపీ మధ్య గత కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సీఎం స్థాయి నేతలు నుంచి సామాన్య కార్యకర్త వరకూ అదే పరిస్థితి. కానీ ఇది పైకి మాత్రమేనని లోపల వేరే జరుగుతోందని తాజాగా చంద్రబాబు పీఏ రాజగోపాల్ నిరూపించారు. చంద్రబాబును కలవడానికి వెళ్లే టీడీపీ నేతలు, కార్యకర్తలు నమస్తే పెడితే  కనీసం పట్టించుకోని రాజగోపాల్ తాజాగా వైసీపీ నాయకులకి తిరుమలలో వీఐపీ దర్శనం కోసం సహకరిస్తూ పాస్‌లు ఇవ్వడం సంచలనంగా మారింది. విషయం బయటికి పొక్కడంతో ప్రక్షాళన చేయాల్సింది తిరుమలను కాదు చంద్రబాబు మీ ప్రక్కన ఉన్న వారిని అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share