Current Date: 05 Oct, 2024

ఈ నెల 16న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 17న ఆయన ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశంపై కూడా చంద్రబాబు మోదీతో చర్చించనున్నారని సమాచారం. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలపై కూడా చంద్రబాబు మోదీని కలసి వినతిపత్రాన్ని అందించనున్నారు.

Share