Current Date: 05 Oct, 2024

ఆగష్టు 15న అన్న క్యాంటిన్లు రీఓపెన్

పేదలకు కడుపునిండా రుచిగాశుచిగా తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటిన్లు మళ్లీ ప్రారంభం  కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో మొత్తం వంద క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. హరే రామ.. హరే కృష్ణ సంస్థ భోజనం అందించే ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం అల్ఫాహరం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్. ఈ అన్న క్యాంటీన్ ద్వారా పిల్లలకు అందించనున్నారు.ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు.

Share