Current Date: 06 Oct, 2024

అంత్యక్రియలు జరిగిన 13 రోజులకి బతికొచ్చాడు!

రోడ్డు యాక్సిడెంట్‌లో అతను చనిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత అతగాడు ఇంటికి ఫోన్ చేశాడు. అంతేకాదు.. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఇంతకీ ఏమైంది ? అతడు ఎలా బతికొచ్చాడు ?మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లా  లచ్చోడా గ్రామం. ఆ గ్రామానికి చెందిన యువకుడు సురేంద్ర శర్మ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఓ క్లాత్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. రెండు వారాల క్రితం రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ సమీపంలో ఉన్న సుర్వాల్‌లో జరిగిన ఒక ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సామాజిక కార్యకర్త బిహారీ సింగ్ సోలంకి ఆ యువకుడి ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ పోస్టును చూసి లచ్చోడా గ్రామానికి చెందిన ఓ కుటుంబం స్పందించింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి తమ కుమారుడు సురేంద్ర శర్మ అయి ఉండొచ్చని వాళ్లు భావించారు. 

Share