Current Date: 05 Oct, 2024

12న నామినేషన్ వేస్తా మంత్రి బొత్స

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోని హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ నేతలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లతో సమావేశం అయ్యామని 12వ తేదీన నామినేషన్ వేస్తానని చెప్పారు. ఈ క్రమంలో అందరి సహకారం కావాలని కోరుతున్నానన్నారు.

Share