Current Date: 05 Oct, 2024

12 మనుగుల శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శనం

సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు భక్తులు పోటెత్తారు.వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు. దీనికి తోడూ వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కి.మీ. ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. సింహాచలం తొలి పావంచవద్ద కొబ్బరికాయ కొట్టి 32 కి.మీ. కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

Share