Current Date: 04 Jul, 2024

కట్న కానుకులపై భర్తకి హక్కులేదు.. తేల్చిన సుప్రీం

వాహ సమయంలో మహిళకు తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బు, బంగారం.. ఆమెకు మాత్రమే చెందుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటిని తీసుకునే హక్కు భర్తకు గానీ, అత్తింటివారికి గానీ ఉండదని తేల్చి చెప్పింది.

కేరళకు చెందిన ఓ మహిళ పెళ్లి అయిన తొలి రాత్రే ఆమెపై ఉన్న 89 గ్రాముల బంగారం, ఆమె తండ్రి ఇచ్చిన రూ.2 లక్షల చెక్‌ను భర్త తీసుకున్నాడు. అయితే వాటిని భద్రపరుస్తానంటూ చెప్పి తీసుకుని.. వారికి అంతకుముందే ఉన్న అప్పులు తీర్చేందుకు ఆ బంగారం, డబ్బును ఉపయోగించుకున్నారు. దీనిపై ఆ మహిళ.. తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బులు, నగలను.. తన భర్త, అత్త తీసుకుని వారికి ఉన్న అప్పులను తీర్చేశారని కోర్టుకు ఎక్కింది.

ఈ కేసులో 2011 లో ఓ ఫ్యామిలీ కోర్టు.. ఆ మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమె డబ్బులు, నగలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును భర్త, అత్తింటివారు కేరళ హైకోర్టులో దాఖలు చేయగా.. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భార్యకు చెందిన ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని తేల్చి చెప్పింది. ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలంటూ ఆ భర్తను ఆదేశించింది.