Current Date: 06 Oct, 2024

ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక మోదీ తొలి వ్యాఖ్యలు ఇవే...

రికార్డు స్థాయిలో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. మోదీ 3.0 కేబినెట్’ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన పొరుగు దేశాల నేతలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తొలి ప్రసంగంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత’ విధానాన్ని కొనసాగించనున్నామని మోదీ స్పష్టం చేశారు. 'సాగర్ విజన్'కు కట్టుబడి, నిబద్ధతతో భారత్ పనిచేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. 

Share