Current Date: 04 Jul, 2024

మహిళలకు ఉచిత బస్ హామి కొంచెం లేటయినా నెరవేర్చుతాం

ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్ హామి కొంచెం  లేటయినా నెరవేర్చుతమనీ రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఏపి లో అములు చేస్తామని వెల్లడించారు.మహిళలకు  ఉచిత బస్సు సౌకర్యం విశాఖ నుంచే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మేము కక్ష సాధింపు చర్యలకు పోబోమని పేర్కొన్నారు. జగన్ హయాంలో మంత్రులలాగా గంగిరెద్దుల్లాగ తలూపుకుంటూ మేము పని చెయ్యబోమని, మంత్రులందరికీ చంద్రబాబు పూర్తి స్వేచ్చ ఇచ్చారని రాబోయే రోజుల్లో ప్రజా సొమ్ము తిన్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.

Share