Current Date: 08 Oct, 2024

కదిరి బస్టాండ్‌లో విద్యార్థిని చేతిలో బిడ్డను పెట్టి తల్లి ఎస్కేప్!

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఓ మహిళ పసికందును బస్టాండ్‌లో వదిలి పారిపోయిన ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని మహిళ చిన్నారితో పాటు ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చింది.. అక్కడ కొద్దిసేపు కలియతిరిగింది.ఆ తర్వాత వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని.పసికందును కొద్దిసేపు చూసుకోమని చెప్పి ఓ విద్యార్థినికి అప్పగించింది. ఆమె మెల్లిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి తల్లి ఎంతసేపటికీ రాకపోవడంతో.. ఆ విద్యార్థిని డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంటనే పోలీసులు కదిరి బస్టాండ్‌కు వెళ్లి మహిళ వివరాలు తెలుసుకుని ఆచూకీ కోసం గాలించారు. ఆమె ఆచూకీ తెలియకపోవటంతో ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించి చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.మహిళ ఆచూకీ కనిపెట్టేందుకు బస్టాండ్‌లోని సీసీ ఫుటేజీని సేకరించారు. బాలికను తీసుకొచ్చిన మహిళ ఉన్న కొద్దిసేపూ కంగారుపడుతూ ఉన్నట్లు గుర్తించామని చెబుతున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమెను గుర్తించే పనిలో ఉన్నారు

Share