శంషాబాద్(TG) నుంచి భోగాపురం (AP) ఎయిర్పోర్టుకు వెళ్లే ఇండిగో విమానానికి దుండగులు బాంబు బెదిరింపులు చేశారు. దీంతో ఫ్లైట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్నటి నుంచి భోగాపురానికి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే.